శ్రీను వైట్ల ఈ సారి రూటు మార్చినట్లున్నాడు !

శ్రీను వైట్ల ఈ సారి రూటు మార్చినట్లున్నాడు !

Published on Aug 15, 2018 3:00 PM IST

‘ఢీ, రెడీ , దూకుడు’ చిత్రాలతో తెలుగు లో అగ్ర దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల తరువాత తీసిన సినిమాలతో అంతే వేగంగా వెనక్కివెళ్లిపోయాడు. రొటీన్ కథలను తెరకెక్కించి పరాజయాలను ముట్టగట్టుకున్న ఈ డైరెక్టర్ ఈ సారి తన రూట్ మార్చుకొని డిఫ్రెంట్ కథ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన రవితేజ తో ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తుండడం విశేషం.

ఇక స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈరోజు ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదలచేశారు. ఈ పోస్టర్ ను చూస్తుంటే శ్రీను వైట్ల తన రెగ్యులర్ స్టయిల్లో కాకుండా మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని అనిపిస్తుంది. చాలా రోజల తరువాత ఇలియానా ఈ చిత్రంతో తెలుగు లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకులముందుకు రానుంది. ఇక వరుస పరాజయాలతో కొనసాగుతున్న రవితేజ, శ్రీను వైట్ల కు ఈ చిత్ర విజయం చాలా కీలకం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు