కింగ్ కోహ్లీ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్!

కింగ్ కోహ్లీ పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Published on Oct 23, 2022 10:24 PM IST


టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లు చాలా ఆసక్తికరంగా గా సాగుతున్నాయి. నేడు జరిగిన కీలక మ్యాచ్ అయిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఉత్కంఠ గా సాగింది. చివరి వరకు ఎవరూ గెలుస్తారు అనే దాని పై నెలకొన్న ఉత్కంఠ లో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో అజేయం గా నిలిచిన విరాట్ కోహ్లీ 6 ఫోర్లు, 4 సిక్స్ లతో పాక్ బౌలర్ల పై విరుచుకు పడ్డారు. టీమిండియా గెలుపు లో కీలకం గా నిలిచారు.

అయితే కింగ్ కోహ్లీ పోరాడిన తీరు పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కోవలో జక్కన్న రాజమౌళి కింగ్ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపించారు. కింగ్ కోహ్లీ టేక్ ఎ బో అంటూ ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్ట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు