SSMB28 షూట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడేనా ?

SSMB28 షూట్ పై క్లారిటీ వచ్చేది అప్పుడేనా ?

Published on Nov 19, 2022 1:00 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. SSMB28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తుండగా పీఎస్ వినోద్ డీవోపీ గా వర్క్ చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉండగా ఇటీవల మహేష్ బాబు గారి తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి హతన్మరణంతో అది కొన్నాళ్ల పాటు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

తండ్రి మరణంతో ఒక్కసారిగా మహేష్ బాబు తోపాటు యావన్మంది సూపర్ ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు ఘట్టమనేని కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కాగా పరిస్థితులు అన్ని చక్కబడిన అనంతరం SSMB28 మూవీ తదుపరి షెడ్యూల్ కి సంబధించి పూర్తి వివరాలు ఫిక్స్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి అనుకున్న విధంగానే SSMB28 షూట్ పక్కాగా కంప్లీట్ అయి ఫిక్స్ చేయబడిన టైంకే ప్రేక్షకుల ముందుకి వస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు