అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ రెండవ చిత్రం ఆమె గురువు మరియు బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహర్ నిర్మించబోతున్నారనే వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 2013లో వచ్చిన కామెడీ డ్రామా, దోస్తానా చిత్రానికి సీక్వెల్ లో జాహ్నవి కపూర్ నటించనున్నారని ఈ వార్త సారాంశం.
ఐతే తాజాగా కరణ్ జోహర్ ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో జాహ్నవి కపూర్ రెండవ చిత్రం గురించి వస్తున్న వార్త పూర్తిగా అవాస్తవం అని ఆయన పోస్ట్ చేశారు. ఇక జాహ్నవి కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ‘ధడక్’ చిత్ర దర్శకుడు శశాంక్ ఖైటన్ జాహ్నవి కపూర్ నుండి మంచి నటన రాబట్టగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహర్ ‘ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్’ పై ఈ చిత్రాన్ని నిర్మించి ఆమెకు బాలీవుడ్ లోకి మంచి ఎంట్రీ అందించారు.