చంద్రున్ని తాకకున్న, హృదయాలను తాకారు.

చంద్రున్ని తాకకున్న, హృదయాలను తాకారు.

Published on Sep 7, 2019 5:22 PM IST

భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ఆఖరి నిమిషంలో నిరాశ మిగిల్చింది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగడానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇస్రో నుండి సంకేతాలు కోల్పోయింది. ఈ ప్రయోగంలో భారత్ 95శాతం సఫలం చెందినప్పటికీ, చారిత్రాత్మక చివరి ఘట్టంలో ఇలా జరగడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు, మొత్తం దేశపౌరులు నిరాశకు గురైయ్యారు. ఐతే ఇస్రో చైర్మన్ కె శివన్ కన్నీటి పర్యంతరం అవడం, ఆయనను ప్రధాని మోదీ ఓదార్చడం దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

దేశవ్యాప్తంగా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు అలాగే సినీ ప్రముఖులు వారికి బాసటగా నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరోలైన అమితాబ్, అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, పర్హాన్ అక్తర్ అలాగే కుష్బూ,తాప్సి,పూజా హెగ్డే,ప్రగ్యా జైస్వాల్ మరియు టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఈ విషయం పై స్పందించారు. వారు సాధించిన విజయానికి అభినందిస్తూ, ఈ ఫెయిల్యూర్ ని అధిగమించి ఇస్రో ధృడ సంకల్పంతో ఇంకా పెద్ద విజయాలు సాధించాలని కాంక్షించారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు