
సాయి ధరమ్ తేజ నటించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 24న విడుదల చేయనున్నారు.
మిక్కీ జే మేయర్ అందించిన అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు సాయి నటన ఈ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవనున్నట్టు సమాచారం. ఫిలింనగర్ కధనాల ప్రకారం ఈ చిత్రం ప్రేక్షకులకు కావలిసినంత వినోదాన్ని పంచనుందట. రెజినా హీరొయిన్. దిల్ రాజు నిర్మాత.