ఈ నెల 17న ప్రారంభం కానున్న సుధీర్ బాబు కొత్త చిత్రం !

ఈ నెల 17న ప్రారంభం కానున్న సుధీర్ బాబు కొత్త చిత్రం !

Published on Aug 15, 2018 5:03 PM IST


‘సమ్మోహనం’ చిత్రం తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరో సుధీర్ బాబు. ఆయన నటించనున్న కొత్త చిత్రం ఈ నెల 17 న రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ కానుంది. పులి వాసు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో సుధీర్ కు జోడిగా మెహ్రీన్ నటించనున్నారు. రీజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ప్రస్తుతం సుధీర్ బాబు నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు తెరకెక్కిస్తున్న నన్ను దోచుకుందువటే అనే చిత్రంలో నటిస్తున్నారు. నాబా నటేష్ కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు