త్వరలో మొదలుకానున్న రూ.400 కోట్ల సినిమా !

త్వరలో మొదలుకానున్న రూ.400 కోట్ల సినిమా !

Published on Jun 25, 2018 2:31 PM IST

తమిళ దర్శకుడు సుందర్.సి ప్రస్తుతం తన భారీ బడ్జెట్ చిత్రం ‘సంఘమిత్ర’ పనుల్లో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమాను అనౌన్స్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈపాటికే మొదలుకావాల్సి ఉండగా ఇంకా కాలేదు. తమిళ మీడియా కథనం ప్రకారం ఈ షూట్ ఆగష్టు నుండి మొదలవుతుందని తెలుస్తోంది.

స్టార్ హీరోలు జయం రవి, ఆర్య, దిశా పఠానిలు నటిస్తున్న ఈ చిత్రం హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో ఉండనుంది. ఆస్కార్ విజేత ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందివ్వనున్న ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ పనిచేయనున్నారు. నిర్మాణ సంస్థ శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ ఈ చిత్రం కోసం సుమారు రూ. 400 కోట్ల రూపాయల్ని ఖర్చు చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు