మహేశ్ సరసన మిల్కీ బ్యూటీ ?

మహేశ్ సరసన మిల్కీ బ్యూటీ ?

Published on Sep 10, 2019 11:55 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాలో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఆడిపాడనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రత్యేక గీతంలో నటించేందుకు తమన్నా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఆగడు సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా నటించిన తమన్నా.. ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం ఓ సాంగ్ లో నటిస్తోంది.

కాగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ అలాగే కొంతమంది ముఖ్య తారాగణం కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఒక్కప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు