సూర్యతో మరోసారి జోడీ కట్టనున్న తమన్నా ?

సూర్యతో మరోసారి జోడీ కట్టనున్న తమన్నా ?

Published on Jun 18, 2018 7:32 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ఎన్జీకె ‘ సినిమా లో నటిస్తున్నాడు. సాయి పల్లవి , రకుల్ ప్రీత్ సింగ్ కథనాయికలు గా నటిస్తున్న ఈ సినిమాని దీపావళి కానుక గా ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక దీని తరువాత వరుస సినిమాలకి కమిట్ అయ్యాడు సూర్య . ‘ఇరుదు సుట్రు’ ఫెమ్ సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమాలో అలాగే సింగం ఫెమ్ హరి దర్శకత్వంలో మరొక చిత్రంలో నటించనున్నాడు .

ఈ రెండు సినిమాల మధ్యలో గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు సూర్య . ఈ సినిమాలో సూర్య కి జోడిగా తమన్నా నటించనున్నట్లు సమాచారం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి ‘అయాన్’ సినిమాలో నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. తెలుగులో ఈ సినిమాని ‘వీడోక్కడే’ పేరుతో విడుదల చేశారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు