మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. యాక్షన్ మొదలైంది !

మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. యాక్షన్ మొదలైంది !

Published on Jan 25, 2021 10:24 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ఈ రోజు నుండి షూట్ మొదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్ మీడియాలో మోషన్ వీడియో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ముందుగా సాంగ్ తో షూట్ మొదలవుతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ట్విస్ట్ లు కూడా ఉన్నాయని.. అలాగే ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందట. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌ గా కనిపించబోతున్నాడు.

కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు