వైరల్ : ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ !

వైరల్ : ఇంట్రెస్టింగ్ ఫోటో పోస్ట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ !

Published on Mar 21, 2022 12:00 PM IST

రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలయికలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రబృందం వరుస టూర్స్ తో హడావుడిగా ఉంది. అయితే, తాజాగా అమృత్‌సర్‌లోని డివైన్ గోల్డెన్ టెంపుల్‌ ని ఎన్టీఆర్ – చరణ్ లతో పాటు రాజమౌళి కూడా సందర్శించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తలపై టోపీతో ముసల్మాన్ గెటప్ లో ముగ్గురు మెరిసిపోతున్నారు.

చరణ్ – రాజమౌళి ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటే.. ఎన్టీఆర్ మాత్రం వేరే కలర్ డ్రెస్ లో కనిపించాడు. పైగా ముగ్గురు దేవాలయం వైపు తిరిగి దణ్ణం పెట్టుకుంటూ దిగిన ఈ స్టిల్ చాలా బాగుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆశీర్వాదం కోసం అమృత్‌సర్‌లోని ఈ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించినట్లు టీమ్ స్పష్టం చేసింది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటిస్తోంది. ధృడంగా ఉండే కొమురం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు