ఎం.జి.రామచంద్రన్ గా అరవింద్‌ స్వామి ?

ఎం.జి.రామచంద్రన్ గా అరవింద్‌ స్వామి ?

Published on Aug 7, 2019 10:31 PM IST

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బయోపిక్ లోనే మరో కీలకమైన పాత్ర ఎం.జి.రామచంద్రన్ ది. ఇప్పుడు ఈ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే షూట్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ నుంచి స్పెషల్ మేకప్ టీమ్ ఇండియాకు రానున్నారు.

హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కూడా చెయ్యనున్నారు. ఈ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లుతో రూపొందుతుంది. ఎలాగూ కంగనా రనౌత్ కి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. అమ్మ బయోపిక్ కాబట్టి తమిళంలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక తెలుగు కన్నడ మలయాళ పరిశ్రమల్లో కూడా ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాబట్టి వంద కోట్లుపెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ ఈ సినిమా కోసం తమిళ్ కూడా నేర్చుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు