మళ్లీ కామెడీనే నమ్ముకున్న డైరెక్టర్ !

మళ్లీ కామెడీనే నమ్ముకున్న డైరెక్టర్ !

Published on Jul 17, 2019 12:22 AM IST

దర్శకుడు కొండా విజయ్ కుమార్ నితిన్ హీరోగా వచ్చిన ఫుల్ ఎంటర్ టైనర్ ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’తో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొత్తానికి ఆ హిట్ కారణంగా నాగచైతన్య పిలిచి మరి ఆఫర్ ఇచ్చినా.. ‘ఒక లైలా కోసం’ అంటూ ప్లాప్ చిత్రాన్ని తీశాడు కొండా విజయ్ కుమార్. మళ్లీ చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకూ రాజ్‌ తరుణ్‌ హీరోగా కె.కె. రాధామోహన్‌ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా కథ వెరీ ఇంట్రస్టింగ్ ప్లే తో సాగుతుందట. ముఖ్యంగా మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో సాగే స్క్రీన్ ప్లే.. సినిమాలో మంచి కామెడీని పండిస్తుందట. ఒకవిధంగా ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ సినిమాలో కూడా ఈ మిస్ అండర్ స్టాడింగ్ కామెడీనే హైలెట్ గా నిలిచింది.

మళ్లీ ఇప్పుడు రాజ్ తరుణ్ తో చెయ్యబోతున్న సినిమాలో కూడా అలాంటి కామెడీనే హైలెట్ గా నిలిచేలా చూసుకుంటున్నాడట. మెయిన్ గా లవ్ స్టోరీనే ఫుల్ ఫన్ తో ఉంటుందట. వెరీ యాక్టివ్ గా ఉండే ఓ కుర్రాడు తన కన్నా వయసులో పెద్దదైన ఓ అమ్మాయిని ఇష్టపడి.. ఆ అమ్మాయిని సొంతం చేసుకునే క్రమంలో జరిగే డ్రామా సినిమాలో చాల బాగుంటుందట. ఇక ఈ చిత్రం ఆగస్ట్‌ నుండి నాన్‌ స్టాప్‌ గా షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు