ఈ స్టార్ హీరోల చూపు ఇప్పుడు మల్టీ స్టారర్స్ వైపే !

ఈ స్టార్ హీరోల చూపు ఇప్పుడు మల్టీ స్టారర్స్ వైపే !

Published on Jun 25, 2018 7:27 PM IST


తెలుగు అగ్ర కథానాయకులు అనగానే గుర్తొచ్చే ఆ నాలుగు పేర్లలో నాగార్జున, వెంకటేష్ పేర్లు కూడా ఉంటాయి. దాదాపు మూడు దశాబ్దాలు పాటు స్టార్ హీరోలుగా తమ కెరీర్ ను కొనసాగించిన ఈ హీరోలు ఇప్పుడు ఉన్నట్టు ఉండి తమ రూటు మార్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు మల్టీస్టారర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. సోలో హీరోగా సినిమాలను తగ్గిస్తూ కాంబినేషన్స్ నే ఎక్కువుగా నమ్ముతున్నారు. ఇప్పటికే వెంకటేష్ బాబీ దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 2’ చిత్రంలో నటిస్తున్నారు.

ఇక నాగార్జున కూడా నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్ తో పవన్ సాతినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో కూడ నాగ్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాలు పూర్తయ్యేలోపు ఈ సీనియర్ హీరోలిద్దరూ మరికొన్ని చిత్రాల్లో కొత్త కాంబినేషన్ లో నటించే అవకాశం ఉంది. ఏదైమైనా ఇప్పుడు ఈ స్టార్ హీరోల చూపు మల్టీ స్టారర్స్ వైపే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు