బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా?

బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా?

Published on Apr 9, 2022 10:28 PM IST

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో అప్పుడే ఆరు వారాలు పూర్తి కావస్తుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో నుంచి ఇప్పటికే ముమైత్‌ ఖాన్‌, శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి మదివాడ వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు. వీరిలో తొలివారం ఎలిమినేట్‌ అయిన ముమైత్‌ ఖాన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా గతవారం రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం మిత్ర శర్మ, అషూ రెడ్డి, హమీదా, నటరాజ్, మహేశ్‌ విట్టా, బిందు మాధవి, అజయ్, స్రవంతి, యాంకర్ శివ, ముమైత్ ఖాన్ నామినేషన్‌లో ఉన్నారు. ఈ పది మందిలో ముమైత్‌ ఖాన్‌, స్రవంతి, మిత్ర శర్మకు తక్కువ ఓట్లు వచ్చాయని, ప్రస్తుతం ఈ ముగ్గురు డేంజర్‌ జోన్‌లో ఉన్నారని తెలుస్తోంది.

ఇక ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉండబోతుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. డేంజర్ జోన్‌లో ఉన్న ముమైత్‌ ఖాన్‌, స్రవంతి, మిత్ర శర్మ ముగ్గురిలో స్రవంతిని, వైల్డ్‌ కార్డ్‌ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ముమైత్‌ను ఇంటి నుంచి బయటకి పంపించేస్తున్నారని అంతా చర్చించుకుంటున్నారు. మరి నిజంగానే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందా? ఉంటే హౌస్ నుంచి బయటకొచ్చే ఆ ఇద్దరు ఎవరు? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు