‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ మార్నింగ్ షో టాక్ !

‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ మార్నింగ్ షో టాక్ !

Published on Nov 8, 2018 12:11 PM IST

భారీ అంచనాలతో భారీ స్థాయిలో ఈ రోజు విడుదలైన అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘థగ్స్ అఫ్ హిందుస్థాన్’ కు నెగిటివ్ టాక్ వస్తుంది. అమితాబ్ బచ్చన్ , కత్రినా కైఫ్ , సనా ఫాతిమా షేక్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకోలేదని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన సెకండ్ హాఫ్ సినిమా ఫలితాన్ని దెబ్బతీసేలా ఉందనిసమాచారం.

డైరెక్షన్ మెయిన్ మైనస్ గా చెప్పుకుంటున్నారు. ఇక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రాన్నివిడుదలకు ముందు ‘బాహుబలి’ చిత్రం తో పోల్చారు. కానీ మొదటి షో కి వస్తున్న టాక్ ప్రకారం కనీసం ఈచిత్రం బాహుబలి కి దరిదాపుల్లో కూడా నిలిచేలాలేదని అంటున్నారు. అయితే ఈచిత్రం కలెక్షన్ల పరంగా హిందీలో కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలాంటి స్టోరీ లను హిందీ ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ మంచి రన్ ను కనబర్చే అవకాశం వుంది కానీ ఇతర భాషల్లో ఈ చిత్రానికి ఆదరణ లభించడం కష్టమే. మరి కాసేపట్లో 123 తెలుగు. కామ్ నుండి ఈ చిత్రం యొక్క పూర్తి రివ్యూ వెలుబడనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు