‘అల వైకుంఠపురంలో’ ఆడియో ఎప్పుడంటే..

‘అల వైకుంఠపురంలో’ ఆడియో ఎప్పుడంటే..

Published on Sep 6, 2019 9:39 PM IST

ప్రస్తుతం ఇండస్ట్రీలో రూపొందుతున్న ఆసక్తికరమైన సినిమాల్లో ‘అల వైకుంఠపురంలో’ కూడా ఒకటి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. తమన్ మాస్ పల్స్ బాగా తెలిసినవాడు కావడంతో పాటల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వారి కోసమే అన్నట్టు పాటలు నవంబర్లో వస్తాయని హింట్ ఇచ్చాడు తమన్. నిన్న ట్విట్టర్ ద్వారా త్రివిక్రమ్, బన్నీలతో కలిసున్న ఫొటోను పోస్ట్ చేసిన తమన్ నవంబర్ కమింగ్ సూన్ అనే హ్యష్ ట్యాగ్ కూడా తగిలించాడు. దీంతో పాటలు నవంబర్ నెలలోనే వస్తాయని ఒక క్లారిటీ వచ్చినట్లైంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే కథానాయిక కాగా టబు, సుశాంత్, నివేత పేతురాజ్, జయరామ్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు