స్టూవర్టుపురంలో గజదొంగ షూటింగ్ ?

స్టూవర్టుపురంలో గజదొంగ షూటింగ్ ?

Published on Apr 13, 2019 9:25 AM IST

‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర్ రావు’ బయోపిక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా వచ్చే నెలలో స్టూవర్టుపురం పరిసర ప్రాంతాల్లో ఈ బయోపిక్ కు సంబంధించి కీలక సన్నివేశాలను షూట్ చెయ్యబోతునట్లు తెలుస్తోంది. అయితే ఈ బయోపిక్ లో సెన్సేషన్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను హీరోయిన్ గా తీసుకున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి.

ఇక ‘టైగర్ నాగేశ్వర్రావు’ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు గాని, 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా టైగర్ నాగేశ్వర్ రావు ఒక భయానక వాతావరణాన్నే సృష్టించారు. మరి అలాంటి బయోపిక్ అంటే అప్పటి విషయాలు బాగానే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు