ప్రకృతి పరిరక్షణ కోసం ఒక్కటైన టాలీవుడ్

ప్రకృతి పరిరక్షణ కోసం ఒక్కటైన టాలీవుడ్

Published on Sep 13, 2019 8:45 PM IST

తెలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న నల్లమల అడవులు ప్రకృతి సౌందర్యానికి, జీవ వైవిధ్యానికి నెలవు. ఈ అడవుల కారణంగా ఎంతో పర్యావరణానికి మేలు జరగడంతో పాటు, జీవులకు కావలసిన ఆక్సిజన్ అందుతుంది. ఐతే ఇప్పుడు అక్కడ యురేనియం తవ్వకాలు జరపాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆ పచ్చని అడివి ఉనికి ప్రమాదంలో పడింది. ఐతే నల్లమలలో కేంద్రం చేపట్టాలని భావిస్తున్న ఈ తవ్వకాలను అనేకమంది వ్యతిరేకిస్తున్నారు.

కాగా టాలీవుడ్ ప్రముఖంగా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలు,నటులు, దర్శక నిర్మాతలు, హీరోయిన్స్ సోషల్ మీడియా ఉద్యమం మొదలుపెట్టారు. సేవ్ నల్లమల, స్టాప్ యురేనియం మైనింగ్ స్లొగన్స్ తో సోషల్ మీడియా వేదికగా గళం ఎత్తారు. తారలు ట్విట్టర్ లో తమ ప్రొఫైల్ పిక్ గా నల్లమల ఫారెస్ట్ ఫోటో పెట్టుకోవడంతో పాటు, మిగతా నటులు కూడా అలా చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఏదిఏమైనా ఒక సోషల్ కాజ్ కొరకు తారలందరూ ఒక తాటిపైకి రావడం చెప్పుకోదగ్గ విషయమే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు