ఫిబ్రవరి 18 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ‘నువ్వలా నేనిలా’

ఫిబ్రవరి 18 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ‘నువ్వలా నేనిలా’

Published on Feb 14, 2013 3:51 AM IST

Nuvvala-Nenila
వరుణ్ సందేశ్ హీరోగా త్రినాధ్ రావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమా ‘నువ్వలా నేనిలా’. అమొఘ్ క్రియేషన్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ సినిమాలో పూర్ణ హీరోయిన్ గా నటించనుంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమానికి సంపత్ నంది, మురళి మోహన్ అతిధులుగా వచ్చారు. త్రినాధ్ రావు మాట్లాడుతూ ‘ వరుణ్ సందేశ్ తో ఇది నా రెండో సినిమా. ఫిబ్రవరి 18 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని 3 షెడ్యూల్స్ లో పూర్తి చేస్తాము. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ ఇచ్చాడని’ అన్నాడు.

త్రినాధ్ రావు వరుణ్ సందేశ్ తో చేస్తున్న ‘ప్రియతమా నీవచట కుశలమా’ షూటింగ్ పూర్తి చేసాడు. వరుణ్ సందేశ్ నటించిన ‘చమ్మక్ చల్లో’ సినిమా ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు