‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా సింగిల్ హ్యాండ్ గణేష్

‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా సింగిల్ హ్యాండ్ గణేష్

Published on Sep 14, 2019 12:33 AM IST

హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది తమిళ సూపర్ హిట్ సినిమా ‘జిగర్తాండ’కు రీమేక్. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 15న హైదరాబాద్ నగరంలో జరపనున్నారు. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరుణ్ తేజ్, వెంకటేష్ గతంలో ‘ఎఫ్ 2’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే టీజర్, ట్రైలర్ అన్నీ బ్రంహాండంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అమితాశక్తి నెలకొంది. పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో అధర్వ మురళి ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాను 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు