ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిధిగా బాలయ్య సినిమా లాంచ్ !

ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిధిగా బాలయ్య సినిమా లాంచ్ !

Published on Mar 28, 2018 1:58 PM IST

నందమూరి బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించనున్న చిత్రం ‘ఎన్టీఆర్’. మహానటుడు, దివంగత ఎన్టీ రామారావుగారి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా రేపు 29వ తేదీన హైదరాబాద్లోని రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఘనంగా ప్రారంభంకానుంది.

ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుగారు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు తండ్రి సొంత ఊరు నిమ్మకూరు, తల్లి బసవతారకం సొంత ప్రాంతం కొమరవోలు నుండి కూడ అభిమానులను ఆహ్వానించారు బాలక్రిష్ణ. ప్రారంభోత్సవం అనంతరం ఒక్క రోజు షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా కొద్ది రోజుల గ్యాప్ తరవాత రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. బాలక్రిష్ణతో పాటు సాయి కొర్రపాటి, విష్ణు ఇందురిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి విడుదలచేసే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు