దుబాయ్ లో విజయ్…ఇండియా – పాక్ మ్యాచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దుబాయ్ లో విజయ్…ఇండియా – పాక్ మ్యాచ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on Oct 23, 2022 10:40 PM IST


టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చివరిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ చిత్రం లో నటించారు విజయ్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది. అయితే UFC- MMA ఛాంపియన్‌షిప్‌కు అబుదాబి ప్రభుత్వం అతన్ని గెస్ట్ గా ఆహ్వానించడంతో దుబాయ్‌కి బయలుదేరాడు. అక్కడ దిగిన తర్వాత, విజయ్ తన ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది.

దుబాయ్ లో ఉన్నట్లు తెలిపారు. ఇండియా – పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ యొక్క అప్డేట్‌ లను క్యాచ్ చేయడానికి తన మొబైల్‌ను రిఫ్రెష్ చేస్తున్నానని పేర్కొన్నాడు. ఇది గొప్ప మ్యాచ్ అని రాసి, కింగ్ కోహ్లి ఆట తీరును కొనియాడారు. విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ హీరో నెక్స్ట్ తన ఖుషి చిత్రం తో ప్రేక్షకులని, అభిమానులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు