‘రాజమౌళి’ అంతిమ లక్ష్యం అదేనట !

‘రాజమౌళి’ అంతిమ లక్ష్యం అదేనట !

Published on Apr 28, 2025 9:00 AM IST

ప్రముఖ రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ఏ విధంగా ఇండియా రిచ్‌ ?’ అని అడిగినప్పుడు.. కథల విషయంలో అని చెప్పానని తెలిపారు. మహాభారతం, రామాయణంలాంటి ఇతిహాసాలు మన ఆస్తులని విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. అలాగే, ‘బజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌, ఆమిర్‌ ఖాన్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు గురించి విజయేంద్ర ప్రసాద్‌ కామెంట్స్ చేశారు.

ఇంతకీ, విజయేంద్ర ప్రసాద్‌ ఏం కామెంట్స్ చేశారంటే.. ‘కొన్ని రోజుల క్రితం సల్మాన్‌ఖాన్‌ను కలిశా. ‘బజరంగీ భాయిజాన్‌’ కొనసాగింపునకు సంబంధించి ఓ పాయింట్‌ చెప్పాను. అది ఆయనకు చాలా బాగా నచ్చింది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ‘మహాభారతం’ ప్రాజెక్టు కోసం ఆమిర్‌ నన్ను ఓసారి కలిశారు. ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు’ అని విజయేంద్ర ప్రసాద్‌ తెలిపారు. ఇక రాజమౌళి అంతిమ లక్ష్యం ‘మహాభారతం’ అని ఓ ప్రశ్నకు సమాధానంగా విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు