మరో ప్రగాత్మక చిత్రం చేయనున్న చియాన్ విక్రమ్.

మరో ప్రగాత్మక చిత్రం చేయనున్న చియాన్ విక్రమ్.

Published on May 22, 2019 1:00 PM IST

సౌత్ ఇండియా లో కమల హసన్ తరువాత వైవిధ్యమైన పాత్రలు, విభిన్నమైన సినిమాల ను ఎంచుకుని అద్భుత నటనను తెరపై ఆవిష్కరించే నటులలో విక్రమ్ ఒకరు. పాత్రకు తగ్గట్టుగా తమ శరీర ఆకృతిని మార్చుకొనే సాహసం ఒక్క విక్రమ్ మాత్రమే చేయగలరు. తాజాగా ఆయన మరో విభిన్న కథాంశం తో తెరకెక్కనున్న మూవీ లో నటించడానికి అంగీకరించారు. “డిమాంటి కాలనీ”, “అంజలి సి బి ఐ” వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెవెన్ స్క్రీన్ బ్యానర్ పై లలిత్ కుమార్, వయోకామ్ 18 లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ కి సంబంధించి విడుదలైన పోస్టర్ విక్రమ్ వివిధ గెట్ అప్స్ లో ఇంట్రెస్టింగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు