‘ఢీ’ సీక్వెల్ కి రంగం సిద్ధం !

‘ఢీ’ సీక్వెల్ కి రంగం సిద్ధం !

Published on Nov 23, 2020 4:04 PM IST

దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్‌లో ‘ఢీ’ సినిమా ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది. కలక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణుకు మొదటి సూపర్ హిట్ సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది. మొదటగా వరుస ప్లాప్స్ వచ్చినప్పటికీ విష్ణుకి ‘ఢీ’ సినిమా భారీ హిట్ ను ఇచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2007లో వచ్చిన ఈ సినిమాకి ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది.

కాగా మొదటి పార్టీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు రానున్న రెండో పార్ట్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మొదటి పార్ట్ లో విష్ణు సరసన జెనిలియా హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీహరి, బ్రహ్మానందం, సునీల్, చంద్రమోహన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించి మరిచిపోలేని నవ్వులను అందించారు. అయితే 13 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతోంది. ఇక ఈ సినిమాను మంచు విష్ణునే స్వయంగా నిర్మిస్తుండగా, భీష్మతో బాగా పాపులర్ అయిన మహతి స్వర భాస్కర్ ఈ సినిమాకి సంగీతం అంధించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు