ఈవారం బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పేది ఆమేనా…?

ఈవారం బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పేది ఆమేనా…?

Published on Sep 14, 2019 1:51 PM IST

బిగ్ బాస్ హౌస్ నుండి మరొకరి ఎలిమినేషన్ కి సమయం ఐయ్యింది. బిగ్ బాస్ వారాంతానికి చేరడంతో అటు ఇంటి సభ్యులతో పాటు, ఇటు బిగ్ బాస్ అభిమానుల మధ్య ఉత్కంఠ పెరిగింది. ఈ వారం ఎఎలిమినేషన్ కొరకు నామినేట్ అయిన సభ్యుల నుండి ఎవరు బిగ్ బాస్ హౌస్ వీడి వెళ్లనున్నారనే సందిగ్ధం అందరిలో మొదలైంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుండి నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, ఆషురెడ్డి చివరిగా అలీ రెజా మొత్తం ఆరుగురు ఎలిమినేషన్ ద్వారా బయటకి పంపబడ్డారు.

ఈ వారం ఎలిమినేషన్ జోన్ లో ఉన్నది మొత్తం ఐదుగురు సభ్యులు. శ్రీముఖి, పునర్నవి, హిమజ, శిల్పా చక్రవర్తి మరియు మహేష్ విట్టా. వీరిలో ఇద్దరిలో ఒకరు ఇంటి నుండి వెళ్లిపోయే ఆస్కారం కలదని అంచనా. వారిలో ఒకరు మహేష్ విట్టా కాగా, మరొకరు వైల్డ్ కార్డు ఎంట్రీ అయిన శిల్ప. శిల్పా చక్రవర్తే ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి బై చెప్పనుందని ప్రముఖంగా వినిపిస్తుంది. ఇంటి సభ్యులతో ఆమె సత్సంబంధాలు నెరపక పోవడంతో పాటు, ఆమె పర్ఫార్మెన్స్ అంతగా ఆకట్టుకొనేలా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. ఇదే కనుక జరిగితే మొదట వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన తమన్నా వలే ఈమె కూడా హౌస్ నుండి త్వరగా ఎలిమినేట్ అయినట్లవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు