‘వైల్డ్ డాగ్’కి సెన్సార్ పూర్తయింది !

‘వైల్డ్ డాగ్’కి సెన్సార్ పూర్తయింది !

Published on Mar 29, 2021 11:27 AM IST

కింగ్ అక్కినేని నాగర్జున చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో నాగ్ ఎన్.ఐ.ఎ అధికారిగా కనిపించనున్నారు. ఇదొక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్. హిమాలయాల్లాంటి టఫ్ లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీలు సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఇది కాకుండా నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు