నందమూరి ఫ్యాన్స్ లో కొనసాగుతున్న ఉత్కంఠ.

నందమూరి ఫ్యాన్స్ లో కొనసాగుతున్న ఉత్కంఠ.

Published on Apr 23, 2020 4:55 PM IST

నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి రియల్ మెన్ ఛాలెంజ్ స్వీకరించారు. ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసిన ఎన్టీఆర్ సీనియర్ స్టార్ హీరోలైన చిరు, నాగ్, వెంకీలతో పాటు బాబాయ్ బాలయ్యను కూడా నామినేట్ చేశారు. ఇక ఎన్టీఆర్ ఛాలెంజ్ ని నేడు చిరు, వెంకీ పూర్తి చేయడం జరిగింది . ఇక మిగిలిగింది నాగార్జున మరియు బాలకృష్ణ. మరి వీరు కూడా చేస్తారా.. చేయరా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

ముఖ్యంగా అబ్బాయ్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ ని బాలయ్య స్వీకరిస్తాడా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయి టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుండగా ఇది పూర్తి చేసి బాలయ్య అవి కేవలం పుకార్లే అని నిరూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఐతే సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా ఉండని బాలయ్య అసలు ఈ ఛాలెంజ్ గురించి తెలుసుకున్నాడా లేదా అనే డౌట్ ఉంది. ఇక నటసింహం ఇంటి పనులు చేయడం కష్టమే అని కొందరి భావన చూద్దాం… ఈ ఛాలెంజ్ ఎలా ముగుస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు