ఎవడు కోసం వర్షంలో ఫైట్ చేస్తున్న చరణ్

ఎవడు కోసం వర్షంలో ఫైట్ చేస్తున్న చరణ్

Published on Mar 21, 2013 5:05 PM IST

Yevadu-Stills
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో వర్షంలో జరిగే ఫైట్ సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లి హిల్స్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ఫైట్ సీక్వెన్స్ లో రామ్ చరణ్, అతనితో పాటుగా కోట శ్రీనివాస్ రావు, సాయి కుమార్ మొదలగు వారు పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు