మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో వర్షంలో జరిగే ఫైట్ సన్నివేశాలు ప్రస్తుతం హైదరాబాద్లోని జూబ్లి హిల్స్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఈ ఫైట్ సీక్వెన్స్ లో రామ్ చరణ్, అతనితో పాటుగా కోట శ్రీనివాస్ రావు, సాయి కుమార్ మొదలగు వారు పాల్గొంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ లు ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఎవడు కోసం వర్షంలో ఫైట్ చేస్తున్న చరణ్
ఎవడు కోసం వర్షంలో ఫైట్ చేస్తున్న చరణ్
Published on Mar 21, 2013 5:05 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : “పారిజాత పర్వం” – ఆకట్టుకోని సిల్లీ కామెడీ డ్రామా
- సమీక్ష : టెనెంట్ – స్లోగా సాగే రెగ్యులర్ క్రైమ్ లవ్ డ్రామా!
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- ఇది మీకు తెలుసా? “వర్షం” సినిమాలో త్రిష ప్లేస్ లో ఆ హీరోయిన్ అనుకున్నారట
- ఆకట్టుకుంటున్న శర్వానంద్ “మనమే” టీజర్!
- ప్రియదర్శి – నభా నటేష్ నెక్స్ట్ మూవీ డార్లింగ్!
- “గుంటూరు కారం” కి బుల్లితెర పై రెస్పాన్స్ ఇదే!