బాలీవుడ్ కి వెళ్తున్న ‘పవన్, మహేష్’ హీరోయిన్ !

బాలీవుడ్ కి వెళ్తున్న ‘పవన్, మహేష్’ హీరోయిన్ !

Published on Jun 12, 2018 11:01 AM IST

‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ప్రణీత సుభాష్’ ఆ తర్వాత కొన్ని తెలుగు, కన్నడ సినిమాల్లో నటియించిన పెద్దగా పేరు రాలేదు. ‘అత్తారింటికి దారేది’లో పవన్ కళ్యాణ్ సరసన, ‘బ్రహ్మోత్సవం’లో మహేష్ బాబు పక్కన అవకాశాలను అందిపుచ్చుకొని బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అయినా ఎందుకో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది.

ప్రస్తుతం ‘ప్రణీత సుభాష్’ హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతుంది. బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖుర్రాన్ తో ఒక మ్యూజిక్ వీడియోలో ఆయుష్మాన్ లవర్ గా నటిస్తోంది. ఈ వీడియోకు చైన్ కిత్తాన్ పేరు పెట్టారు. సురేష్ త్రిపాఠి ఈ మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహిస్తున్నారు. రోచక్ కోహ్లీ ఈ వీడియోను కంపోజ్ చేస్తున్నారు. అయితే ఆయుష్మాన్ ఖుర్రాన్ ప్రముఖ సంగీత దర్శకుడు మరియు సింగర్ కావడం విశేషం. ప్రణీత ఈ మ్యూజిక్ వీడియోలో నటించిన తర్వాతానైన బాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు