‘2.0’ను దీపావళికే ఫిక్స్ చేసిన రజనీ!

‘2.0’ను దీపావళికే ఫిక్స్ చేసిన రజనీ!

Published on Nov 20, 2016 5:35 PM IST

robo
సూపర్ స్టార్ రజనీ కాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రభంజనం ‘రోబో’కి సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాకు శంకర్ ‘2.0’ అన్న ఒకే టైటిల్‌ను తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా అన్ని భాషలకూ ఫిక్స్ చేశారు. ఇక అదేవిధంగా ‘2.0’ లోగో, ఫస్ట్‌లుక్‌లను నేడు ముంబైలోని యాష్‌రాజ్ ఫిల్మ్ స్టూడియోలో వైభవంగా నిర్వహించిన వేడుకలో విడుదల చేశారు.

అదిరిపోయే లుక్స్‌తో రజనీ, విలన్ అక్షయ్ కుమార్‌లను పరిచయం చేస్తూ వచ్చిన పోస్టర్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గెటప్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాను దీపావళి 2017కు ఫిక్స్ చేసినట్లు 2.0 టీమ్ పోస్టర్స్ ద్వారానే స్పష్టం చేసేసింది. 3డీ వర్షన్‌లో సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. అప్పటికి అన్ని కార్యక్రమాలనూ పక్కాగా పూర్తి చేసి ఎవ్వరూ ఊహించని రీతిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు