సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుండి గుజరాత్ లో జరగనుంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ సభ్యులు అక్కడ జరగనున్న షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసున్నారు. అలాగే దానితో పాటుగా హైదరాబాద్ లో జరగనున్న షూటింగ్ కొరకు కూడా వారు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల చివర్లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నాహీరోయిన్ గా నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి 2011లో హిట్ సాదించిన ‘దూకుడు’ సినిమాకి పనిచేసిన అదే టీం పనిచేస్తోంది. మహేష్ బాబు ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా 2014 సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏప్రిల్ నుండి గుజరాత్ లో ‘ఆగడు’ షూటింగ్
ఏప్రిల్ నుండి గుజరాత్ లో ‘ఆగడు’ షూటింగ్
Published on Mar 12, 2014 8:56 AM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని మూవీ లేటెస్ట్ అప్ డేట్
- విజయ్ దేవరకొండ – ప్రశాంత్ నీల్ కాంబో మూవీ పై క్లారిటీ ఇదే
- ‘పుష్ప – 2’ : పవర్ఫుల్ గా ఫస్ట్ సాంగ్ ప్రోమో
- “గేమ్ చేంజర్” ప్లాన్ లోనే “దేవర” ట్రీట్ కూడా?
- కృష్ణ గారి పై పవన్ వ్యాఖ్యలు బాధించాయి – సీనియర్ నరేష్