కరోనా వైరస్ మొత్తం ప్రపంఛాన్ని అతలాకుతలం చేస్తోంటే.. కొంతమంది యువకులు ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది ప్రముఖులు కరోనా సోకి చనిపోయారంటూ ఫేక్ న్యూస్ లను క్రియేట్ చేస్తున్నారు. కేరళలోని ఓ యువకుడు కేరళ సూపర్స్టార్ మోహన్లాల్ కరోనా సోకి చనిపోయాడని ఫేక్ న్యూస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో మోహన్లాల్ ఫ్యాన్స్ ఆ పోస్ట్ ను సీరియస్ గా తీసుకుని ఆ యువకుడి పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఏమైనా ఇలాంటి ఆకతాయిల పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇక ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఇప్పటికే చాల మంది ప్రాణాలను కోల్పోయారు. ఇంకా లక్షలాది మంది ఈ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా కరోనా మహమ్మారి నుండి ప్రపంచం బయట పడాలని ఆశిద్దాం.