‘బాహుబలి’ విషయంలో గర్వంగా ఫీలవుతున్న సెన్సార్ బోర్డ్

‘బాహుబలి’ విషయంలో గర్వంగా ఫీలవుతున్న సెన్సార్ బోర్డ్

Published on Jul 5, 2015 3:41 PM IST

Baahubali
భారతదేశ మొట్టమొదటి భారీ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’ రిలీజ్ కావడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ వారు ‘యు/ ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్ర తమిళ నిర్మాతలైన స్టూడి గ్రీన్ వారు వారు రీసెంట్ గా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. అందులో తమిళ సెన్సార్ బోర్డ్ మెంబర్స్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా మన సౌత్ ఇండియా నుంచి వస్తున్నందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారని తెలిపారు.

సెన్సార్ వారు ‘ఈ సినిమాని చూసి థ్రిల్ ఫీలవ్వడమే కాకుండా, బాహుబలి లాంటి సినిమా సెన్సార్ సర్టిఫికేట్ లో తమ పేరు కూడా ఉండడం గర్వంగా భావిస్తున్నామని’ తెలిపారు. సెన్సార్ వారు ఈ సినిమా చూడగానే మూవీపై సూపర్బ్ రెస్పాన్స్ ఇవ్వడమే కాకుండా సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నామని తెలిపారు. భారీ అంచనాలతో హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో రానున్న ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

టాలీవుడ్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుధీప్ లు ముఖ్య పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు