సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దర్శకుడు’ !

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దర్శకుడు’ !

Published on Jul 26, 2017 2:16 PM IST


స్టార్ డైరెక్టర్ సుకుమార్ సంస్థ సుకుమార్ రైటింగ్స్ పై రూపుదిద్దుకున్న చిత్రం ‘దర్శకుడు’. సుకుమార్ కేవలం నిర్మాణంలో మాత్రమేగాక కథను అందించి, ప్రతి ప్రమోషనల్లో చురుగ్గా పాల్గొనడం వలన ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అన్ని పనుల్ని పూర్తిచేసుకుని విడుదలకు ఎదురుచూస్తున్న ఈ చిత్రం యొక్క సెన్సార్ కొద్దిసేపటి క్రితమే పూర్తయింది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ ‘U’ సర్టిఫికెట్ జారీ చేసింది. అశోక్, ఈషా రెబ్బ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు హరి ప్రసాద్ జక్కా డైరెక్ట్ చేశారు. ట్రైలర్ తో పాటు పాటలకు కూడా మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 4న రిలీజ్ చేయనున్నారు. ఒక దర్శకుడి నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు