ఈ ఏడాది మూడవ సినిమాతో సిద్దమైన గోపిచంద్ !

ఈ ఏడాది మూడవ సినిమాతో సిద్దమైన గోపిచంద్ !

Published on Apr 28, 2017 1:02 PM IST


పోయిన 2016లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని హీరో గోపీచంద్ ఈ సంవత్సరం ఒకటి ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. తాజాగా బి. గోపాల్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ అనే చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. వచ్చే మే నెల 19వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు బి. గోపాల్ కూడా చాలా ఎళ్ళ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో సైతం మంచి ఆసక్తి నెలకొంది.

తాండ్ర రమేష్ తన హోమ్ బ్యానర్ లో నిర్మస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇది కాకుండా సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న ‘గౌతమ్ నంద’ తుది దశ షూటింగ్లో ఉండగా ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో చేసిన ‘ఆక్సిజను చిత్రం కూడా త్వరలోనే విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు