కృష్ణా, గుంటూరుల్లో ‘జై సింహ’ లేటెస్ట్ కలెక్షన్స్ !

కృష్ణా, గుంటూరుల్లో ‘జై సింహ’ లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Jan 17, 2018 9:54 AM IST


ఈ సంక్రాతి రేసులో బాలక్రిష్ణ ‘జై సింహ’ చిత్రం ముందంజలో దూసుకుపోతోంది. పండుగ సెలవుల్ని సంపూర్ణంగా ఉపయోగించుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి రోజు వచ్చిన మిశ్రమ స్పందనతో సంబంధం లేకుండా రోజు రోజుకు సినిమా పుంజుకుంటోంది.

కృష్ణా జిల్లాలో 3 రోజులకు రూ.79.73 లక్షల్ని వసూలు చేసిన ఈ సినిమా 5వ రోజు కూడా అదే జోరు కొనసాగించి రూ.23.23 లక్షలు రాబట్టి 5 రోజులకుగాను రూ.1.27 కోట్లను ఖాతాలో వేసుకుంది. అలాగే గుంటూరులో కూడా 5వ రోజు మంచి రన్ కనబర్చి రూ.22.3 లక్షలు వసూలు చేసి మొత్తంగా రూ.2.06 కోట్ల షేర్ ను అందుకుంది. మొత్తం మీద సి.కళ్యాణ్ నిర్మాణంలో కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్ర్రం ప్రాఫిటబుల్ వెంచర్ గా మారనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు