కంట తడిపెట్టిస్తున్న చిరంజీవి సర్జా చివరి మెస్సేజ్ .

కంట తడిపెట్టిస్తున్న చిరంజీవి సర్జా చివరి మెస్సేజ్ .

Published on Jun 11, 2020 5:30 PM IST

కన్నడ పరిశ్రమను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన హీరో చిరంజీవి సర్జా మరణం. కేవలం 39ఏళ్ల వయసులో చిరంజీవి సర్జా లోకాన్ని విడిచి వెళ్లడం, ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా తన భార్య మేఘనా రాజ్ బాధ వర్ణనాతీతం. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. కన్నడలో మంచి స్టార్ గా ఎదుగుతున్న ఈ యువ హీరో మరణం అందరినీ కలచివేస్తుంది.

ఇక చిరంజీవి సర్జా మరణించిన రాత్రి తన మిత్రుడితో వాట్స్ అప్ చాట్ చేశారు. అందులో ఆయన ఫ్రెండ్స్ తో ఓ వారం రోజుల ట్రిప్ ప్లాన్ చేశారు. దాని గురించి వారిమధ్య సంభాషణ నడిచింది. ఆ ఛాట్ లో చివరిగా చిరంజీవి సర్జా రేపు ఏమి జరుగుతుందో మనకు, తెలియదు, విధి మన కోసం ఏది రాసిపెట్టి ఉంటే అది జరుగుతుంది అని అర్థం వచ్చేలా ఆయన మెస్సేజ్ చేశారు. నిజంగా ఆ రోజే రాత్రే ఆయన గుండె నొప్పితో మరణించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు