సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. ఇద్దరు సౌతిండియన్ లెవెల్ స్టార్స్ కలిసిచేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అహ్మదాబాద్లో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోన్న సినిమా, ఈ షెడ్యూల్తో 70% పైనే పూర్తవుతుందట. ఈనెల 24వరకూ టీమ్ అహ్మదాబాద్లోనే షూటింగ్ జరపనుంది.
హైద్రాబాద్ నేపథ్యంలో నడిచే సన్నివేశాలే అయినా, గుజరాత్లో అయితే సినిమా షూటింగ్ను చూడడానికి జనం ఎక్కువగా రారన్న ఉద్దేశంతో అక్కడ షూట్ చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా రాత్రి పూట పలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఠాగూర్ మధు. ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య విలన్గా నటిస్తున్నారు.