“ఇష్క్” చిత్ర దర్శకుడయిన విక్రం కుమార్ నాగార్జున కలల చిత్రం మూడు తరాలు కలిసి నటించబోయే చిత్రంకి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వర రావు ,నాగార్జున మరియు నాగ చైతన్య ఇలా మూడు తరాలు తెర మీద కనిపించబోతున్న ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నాగార్జున ఈ చిత్రానికి కథలు వింటున్నాం అని చెప్పారు. ఆయనకు కథలు చెప్పిన వారిలో విక్రం కుమార్ ఒకరు ఇష్క్ చిత్ర కథానాయకుడు నితిన్ చూచాయిగా ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించాబోతున్నారని చెప్పారు. ట్విట్టర్ లో నితిన్ ఇలా పేర్కొన్నారు ” నా చిత్ర దర్శకుడు విక్రం కుమార్ తరువాతి చిత్రం మల్టీ స్టారర్ చిత్రం ఈ చిత్రంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కనిపించడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం” అని చెప్పారు. నితిన్ ఈ ట్వీట్ లో అక్కినేని కథానాయకుల గురించి ప్రస్తావించకపోయినా పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ ట్వీట్ అక్కినేని వంశానికి సంభందించిన విషయమే . ఇష్క్ చిత్ర విజయం తరువాత విక్రం కుమార్ ఈ చిత్రం చెయ్యటం మూలాన చిత్రం మీద మరిన్ని అంచనాలు పెంచుతాయి. అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “జై హనుమాన్”.. అదిరే పోస్టర్ తో ప్రశాంత్ వర్మ గూస్ బంప్స్ ప్రామిస్
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- టాక్ : ఈసారి టార్గెట్ మిస్ అవ్వదంటున్న రౌడీ హీరో ?
- ఈ నాలుగు భారీ చిత్రాలను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయనున్న అనిల్ తడాని!
- ‘ది రాజా సాబ్’ : ఆ వార్తల్లో నిజం లేదట ?
- ఇస్మార్ట్ బ్యూటీతో ప్రభాస్ ఆటా పాట.!
- ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న ‘టిల్లు స్క్వేర్’