“ఇష్క్” చిత్ర దర్శకుడయిన విక్రం కుమార్ నాగార్జున కలల చిత్రం మూడు తరాలు కలిసి నటించబోయే చిత్రంకి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వర రావు ,నాగార్జున మరియు నాగ చైతన్య ఇలా మూడు తరాలు తెర మీద కనిపించబోతున్న ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నాగార్జున ఈ చిత్రానికి కథలు వింటున్నాం అని చెప్పారు. ఆయనకు కథలు చెప్పిన వారిలో విక్రం కుమార్ ఒకరు ఇష్క్ చిత్ర కథానాయకుడు నితిన్ చూచాయిగా ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించాబోతున్నారని చెప్పారు. ట్విట్టర్ లో నితిన్ ఇలా పేర్కొన్నారు ” నా చిత్ర దర్శకుడు విక్రం కుమార్ తరువాతి చిత్రం మల్టీ స్టారర్ చిత్రం ఈ చిత్రంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కనిపించడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం” అని చెప్పారు. నితిన్ ఈ ట్వీట్ లో అక్కినేని కథానాయకుల గురించి ప్రస్తావించకపోయినా పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ ట్వీట్ అక్కినేని వంశానికి సంభందించిన విషయమే . ఇష్క్ చిత్ర విజయం తరువాత విక్రం కుమార్ ఈ చిత్రం చెయ్యటం మూలాన చిత్రం మీద మరిన్ని అంచనాలు పెంచుతాయి. అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఇది మీకు తెలుసా? “పోకిరి” సినిమాకి మరో టైటిల్.. మహేష్ పేరు కూడా వేరే
- లేటెస్ట్ : SSMB 29 పై ఆసక్తికర విషయాలు వెల్లడించిన నిర్మాత ఎస్. గోపాల్ రెడ్డి
- సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ లో సందడి చేసిన నాచురల్ స్టార్ నాని
- క్రేజీ బజ్ : “శక్తి మాన్” లో రిషబ్ శెట్టికి పవర్ఫుల్ పాత్ర?
- విశ్వంభర: వేరే లెవెల్లో ఇంటర్వల్ సీక్వెన్స్!
- అఫీషియల్ : నేడు ‘కల్కి 2898’ నుండి స్పెషల్ అప్ డేట్
- కల్కి: అశ్వథ్థామ ఇంట్రో వీడియో పై సాయి ధరమ్ కామెంట్స్!