అక్కినేని నాగ చైతన్య, సమంత ‘మనం’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లెజెండ్ ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నారాయణ గూడలో జరుగుతోంది. నాగార్జున ఈ సినిమాని ‘మేజికల్’ గా పిలుస్తారు. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ – నవంబర్ లో పూర్తి కావచ్చునని ప్రొడక్షన్ టీం భావిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్నాడు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి డైలాగ్స్ ని అందించిన హర్షవర్ధన్ ఈ సినిమాకి డైలాగ్స్ ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున సరసన శ్రియ, నాగ చైతన్య సరసన సమంతలు నటిస్తున్నారు.
నారాయణగూడలో సందడి చేస్తున్న చైతు – సమంత
నారాయణగూడలో సందడి చేస్తున్న చైతు – సమంత
Published on Jun 12, 2013 7:00 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మెగాస్టార్ ‘విశ్వంభర’లో విజయశాంతి ?
- “అవతార్”, “టైటానిక్” ల తర్వాత దళపతి సినిమానే..
- ‘సుడిగాడు – 2’ పై అల్లరి నరేష్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
- ‘సలార్ 2’లో మరో బాలీవుడ్ హీరోయిన్ ?
- పుష్ప 2 మూవీ పై లేటెస్ట్ ఇన్ఫో!
- లేటెస్ట్ : సినిమాల పై పుష్ప నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు
- “గేమ్ ఛేంజర్” కోసం రామ్ చరణ్ కి ఓవరాల్ ఇంత రెమ్యునరేషన్?