‘జనతా గ్యారేజ్’ బ్లాక్బస్టర్ విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ తన కొత్త సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక తాజాగా ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళేరోజు గురించి ఓ వార్త అందింది. ఫిబ్రవరి 11న సినిమాను ప్రారంభించి, అదేరోజున సెట్స్పైకి తీసుకెళ్ళాలని టీమ్ భావిస్తోందట. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ భారీ ఎత్తున నిర్మించనున్న ఈ సినిమా సెట్స్పైకి వెళ్ళకముందునుంచే అంచనాలు రేకెత్తిస్తోంది.
జై లవకుశ పేరుతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు కూడా ఇప్పట్నుంచే ఓ ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్ రామ్ ఈ టైటిల్ను రిజిస్టర్ చేయడంతో ఆ టైటిల్ ఖరారైనట్లు అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ను ఓ కొత్త కోణంలో చూపించే సినిమాగా ఇది నిలుస్తుందట. అన్ని కమర్షియల్ హంగులతో, టెక్నికల్గా భారీ హంగులతో సినిమా తెరకెక్కనుంది.