జనవరి 1న వస్తున్న ‘రఘువరన్ బిటెక్’

జనవరి 1న వస్తున్న ‘రఘువరన్ బిటెక్’

Published on Dec 18, 2014 3:37 PM IST

Raghuvaran-B.Tech
ధనుష్, అమలా పాల్ జంటగా నటించిన తమిళ సినిమా ‘విఐపి’. తమిళంలో ఘనవిజయం సాదించిన ఈ సినిమాను తెలుగులో ‘రఘువరన్ బిటెక్’ పేరుతో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవి కిషోర్ అనువదిస్తున్నారు. జనవరి 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు అద్బుత స్పందన లభించింది. సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన వెల్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ధనుష్ 25వ సినిమాగా విడుదలైన ‘రఘువరన్ బిటెక్’ తమిళంలో ధనుష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాదించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. బిటెక్ చదివిన నిరుద్యోగి పాత్రలో ధనుష్ నటించారు. సినిమా థీమ్ సాధారణ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకునే విధంగా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు