రాజశేఖర్ – చిరంజీవి మధ్య తొలగిన మనస్పర్ధలు

రాజశేఖర్ – చిరంజీవి మధ్య తొలగిన మనస్పర్ధలు

Published on Jan 25, 2015 9:58 AM IST

chiranjeevi-rajashekar1
మెగాస్టార్ చిరంజీవి మరియు డాక్టర్ రాజశేఖర్ మధ్య కొన్ని పరిస్థితుల కారణం వల్ల గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు చోటు చోటుచేసుకున్నాయి. ఈ విషయం పబ్లిక్ గా అందరికీ తెలిసిన విషయమే.. తాజా సమాచారం ప్రకారం ఈ ఇరువురి మధ్య మనస్పర్దలకు తెరపడింది. ఈ విషయాన్ని రాజశేఖర్ తెలియజేశారు.

రాజశేఖర్ తాజాగా ఇచ్చిన ఓ ప్రెస్ మీట్ లో చిరంజీవి తనకు మధ్య ఉన్న మనస్పర్ధలు చేరిగిపోయాయని, ప్రస్తుతం వారిద్దరి మధ్య మంచి రిలేస్షణ్ షిప్ ఏర్పడుతున్నట్లు తెలిపారు. వారిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంలో నాగబాబు కీకల పాత్ర పోషించాడని కూడా తెలిపాడు. అలాగే త్వరలోనే రాజశేఖర్ స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి తన ఇంట్లో జరగబోయే ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

రాజశేఖర్ నటించిన గడ్డం గండ సినిమా ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విజయం పై రాజశేఖర్ ఎంతో నమ్మకంగా ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు