విలక్షణ దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఓ స్టైలిష్ రివెంజ్ డ్రామాతో హిట్ కొట్టిన సుకుమార్, ఈసారి రామ్ చరణ్తో విలేజ్ డ్రామాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్లో సెట్స్పైకి వెళ్ళనుంది. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ను కూడా సుకుమార్ త్వరత్వరగా పూర్తి చేస్తున్నారు.
ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం ట్యూన్స్ సమకూర్చే పనిలో ఉన్నారట. ఇప్పటికే రెండు ట్యూన్స్ రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. సుకుమార్-దేవిశ్రీల కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన అన్ని బ్లాక్బస్టర్ ఆల్బమ్స్లానే ఈ ఆల్బమ్ కూడా ఉంటుందట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్గా నటించనున్నారు.