ఆ హీరో ఎనర్జీ ఇష్టమన్న ఆది పినిశెట్టి !

ఒక విచిత్రం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన ఆది పినిశెట్టి ఆ సినిమా తరువాత చాలా సినిమాల్లో నటించాడు. తాజాగా ఆది నటించిన రంగస్థలం సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రంగస్థలం ప్రమోషన్స్ లో ఆది ప్రేక్షకులతో సోషల్ మీడియా ద్వారా మాట్లాడారు.

ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆది మాట్లాడుతూ… నాకు ఎన్టీఆర్ ఎనర్జీ అంటే ఇష్టం. స్క్రీన్ మీద షార్ప్ గా కనిపిస్తాడని చెప్పాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆది చెప్పిన మాటలకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలే కాకుండా హీరోగా నటిస్తున్నాడు. లవర్స్ డైరెక్టర్ హరినాథ్ దర్శకత్వంలో ఆది ఒక సినిమా చేస్తున్నాడు.

Exit mobile version