
నాగచైతన్య, కాజల్ వంటి అగ్రతారలతో ‘దడ’ వంటి డిజాస్టర్ ని తెరకెక్కించిన అజయ్ భుయన్ త్వరలో బాలీవుడ్ లో తన రెండవ సినిమాతో మనల్ని అలరించనున్నాడు. ‘ఫిర్ సే’ అనే టైటిల్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ విడుదల చేసారు
బ్రేక్ అప్ ల నేపధ్యంలో సాగే కధతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కునాల్ కోహ్లి ఈ సినిమాతో తెరారంగ్రేటం చేయనున్నాడు. అజయ్ తెరకెక్కించిన మొదటి బాలీవుడ్ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై ఒత్తిడి నెలకొంది

